అక్రమంగా కట్టడాలను నిలిపివేయాలి

Published: Wednesday February 09, 2022
ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 8 ప్రజాపాలన ప్రతినిధి : యాచారం మండల పరిధిలోని నందివనపర్తి అనుబంధ గ్రామమైన ఘంటోనిబావి వద్ద నూతనంగా నిర్మాణం చేపడుతున్న మూడెడ్ల యాదగిరిరెడ్డి గృహనిర్మాణమును నిలిపివేయాలని గత నెల 20న గ్రామ పంచాయతీ కార్యదర్శి మూడెడ్ల విష్ణువర్ధన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మా ఇంటి స్థలంలో అక్రమంగా ఇంటినిర్మాణాన్ని మూడెడ్ల యాదగిరి రెడ్డి చేపడుతున్నాడని ఇంటి నిర్మాణ విషయమై గ్రామ పంచాయతీ నుంచి అనుమతి ఇవ్వవ్వవద్దని తద్వారా నిర్మాణమును నిలిపి వేయాలని కోరామని అన్నారు. ఈ నిర్మాణంపై ఇప్పటివరకు అధికారులు చర్యలు తీసుకోలేదని ఇకనైనా అధికారులు స్పందించి ఇంటి నిర్మాణమును ఆపివేయాలని వారు కోరారు.