ప్రతి ఒక్కరూ కరోనా టీకాను తీసుకోవాలి : మేయర్ జక్క వెంకట్ రెడ్డి

Published: Thursday May 13, 2021
మేడిపల్లి, మే12 (ప్రజాపాలన ప్రతినిధి) : కరోనా వైరస్ వ్యాప్తి విజృంభిస్తున్న నేపథ్యంలో 45 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ కరోనా టీకాను తీసుకోవాలని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి సూచించారు. ఈ మేరకు మేయర్ జక్క వెంకట్ రెడ్డి కార్పొరేషన్ పరిధిలో రెండవ డోస్ కరోనా టీకాను తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్ డౌన్ ను ప్రతి ఒక్కరూ పాటిస్తూ, కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, కార్పొరేటర్లు, నాయకులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.