రైతులను ఆదుకున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ రచ్చబండ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత జువ్వాడి

Published: Saturday June 18, 2022

కోరుట్ల, జూన్ 17 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల మండలం యూసఫ్ నగర్ గ్రామంలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో  కాంగ్రెస్ నేత జువ్వాడి కృష్ణ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణ రావు మాట్లాడుతూ రైతులను రైతు కూలీలను కౌలు రైతులను ఆదుకునే బాధ్యత తీసుకుంటుంది అని వరంగల్ లో డిక్లరేషన్ లో తెలుపగా, అదే విధంగా రైతు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కలిపిస్తూ ఇక్కడి ప్రాంత రైతులు పండించే చెరుకు కర్మగారని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే తిరిగి ప్రారంభిస్తామని అని అదే విధంగా ఇక్కడ పండించే పసుపు పంటకు గిట్టుబాటు ధర కలిపిస్తూ పసుపు బోర్డ్ ని కూడా తీసుకువస్తామని  రైతులతో .రైతు కూలీలతో కౌలు రైతులతో గ్రామీణ ఉపాధి హామీ కూలితో కూడా రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడం జరిగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ముక్కెర లిoబాద్రి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొంతం రాజాం, పట్టణ అధ్యక్షుడు తిరుమల గంగాధర్ గౌడ్, బ్లాక్ ప్రెసిడెంట్ పెరుమాండ్ల సత్యనారాయణ, కోరుట్ల నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలేటి మహిపాల్ రెడ్డి, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు శశిధర్ రెడ్డి, మండల యూత్ కాంగ్రెస్ అద్యక్షుడు పన్నల అంజి రెడ్డి, కనకట్టు రమేష్, మోగిలి కార్తిక్,  బొనడ్ల పెద్దన్న,  గంగరాజం, మారుపాక సుమన్ తదితరులు పాల్గొన్నారు.