మడుపల్లి ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్ధి సమ్మేళనం

Published: Monday February 15, 2021

మధిర, ఫిబ్రవరి 14, ప్రజాపాలన: మడుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఈరోజు జరుగబోవు పూర్వ విద్యార్ధి సమ్మేళనం కార్యక్రమం పురస్కరించుకొని మునిసిపల్ వైస్-ఛైర్పర్సన్ విద్యా లత వెంకట రెడ్డి,6వ వార్డు కౌన్సిలర్ తొగరు వరలక్ష్మి ఓంకార్,7వ వార్డు కౌన్సిలర్ మేడికొండ కళ్యాణి కిరణ్ మరియు విద్యా కమిటీ చైర్మన్ వేల్పుల రాజేశ్వరి గార్ల ఆధ్వర్యంలో పాఠశాల పరిసరాలను పరిశుభ్రం చేసే కార్యక్రమం మునిసిపల్ సిబ్బందితో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం లో తెరాస నాయకులు మేడికొండ కిరణ్,తొగరు ఓంకార్ గ్రామ పెద్దలు ఊట్ల పిచ్చయ్య, పంగా శేషగిరిరావు, కాశిని తిరుపతి స్వామి తదితరులు మరియు మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.