కాంగ్రెస్ పార్టీ 138 ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Published: Thursday December 29, 2022
* మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ బ్యూరో 28 డిసెంబర్ ప్రజా పాలన : కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించామని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. బుధవారం వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో  మాజీ మంత్రి వర్యులు గడ్డం ప్రసాద్ కుమార్ నివాసం వద్ద కాంగ్రెస్ పార్టీ 138 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధిగా మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ విచ్చేసి కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వల్ల  దేశంలో సంస్కరణలు జరిగాయాని, దేశానికి స్వాతంత్ర తేవడం మెదలుకొని తెలంగాణ రాష్ట్రన్ని ఇచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేసిందన్నారు. నేటికీ ప్రజల కోసం నిరంతరం ఆలోచిస్తూన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని రానున్న  ఎన్నికల్లో రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసారు.రాహుల్ గాంధీ భారత్ జోడో అని కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేస్తున్న పాదయాత్ర ప్రజల్లోకి వెళ్లిందని రాహుల్ గాంధీ ప్రధాని కావాలని దేశ ప్రజలు కోరుతున్నారని ఈ కోరిక తప్పక నెరవేరుతుందని ఆశభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో  వికారాబాద్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్ద సుధాకర్ రెడ్డి వికారాబాద్ నియోజకవర్గ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ అనుబంధ సంఘాలు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు