పట్లూరులో జడ్పీ నిధులతో సిసి రోడ్ల నిర్మాణం

Published: Wednesday January 12, 2022
సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్
వికారాబాద్ బ్యూరో 11 జనవరి ప్రజాపాలన : 5 లక్షల జడ్పీ నిధులతో సిసి రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నామని సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్ అన్నారు. మంగళవారం మర్పల్లి మండల పరిధిలోని పట్లూర్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో సిసి రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి వార్డులో రోడ్ల సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. అందులో భాగంగా కోటపల్లి నర్సిములు ఇంటి నుండి ఎం.నర్సిములు ఇంటి వరకు, ఏముల వీరన్న ఇంటి నుండి కోటపల్లి మోహన్ ఇంటి వరకు, గజ్జల ఏషబ్ ఇంటి నుండి చర్చి వరకు పనులు ప్రారంభించామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మోహిజ్, పంచాయతీ కార్యదర్శి సంతోష, జీపీ మెంబర్స్ నీలమ్మ, బాలేష్, సుకెందర్, అంజాత్, నర్సిములు, నాయకులు మోహన్, ప్రవీణ్, అశోక్, నిస్సార్ కాలనీ పెద్దలు పాల్గొన్నారు.