వృక్షాలను రక్షించుకుందాం.. ఆరోగ్యంగా జీవిద్దాం ఎమ్మెల్యే శ్రీ మంచిరెడ్డి

Published: Saturday July 30, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 29 ప్రజాపాలన ప్రతినిధి

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 29 ప్రజాపాలన ప్రతినిధి8వ విడత హరితహారంలో భాగంగా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో మున్సిపల్ సిబ్బందితో కలిసి మొక్కలు నాటిన ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి .

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యలు కావాలని, భావితరాల భవిష్యత్తు కోసం చెట్లను నరకొద్దని, మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలని అన్నారు.

కార్యక్రమంలో మున్సిపల్ జవాన్ లక్ష్మయ్య మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.