బంట్వారంలో హాత్ సే హాత్ జోడో

Published: Wednesday February 15, 2023
* మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ బ్యూరో 14 ఫిబ్రవరి ప్రజాపాలన : రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా హాత్ సే హాత్ జూడో కార్యక్రమాన్ని టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపుమేరకు నిర్వహిస్తున్నామని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. మంగళవారం బంట్వారం మండల కేంద్రంలో బంట్వారం గ్రామ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోసారం వెంకటేశం ఆధ్వర్యంలో హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో భాగంగా గడపగడపకు తిరిగి కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి పనులే నేటికీ దర్శనమిస్తున్నాయని అన్నారు. రైతు పక్షపాతి కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. అన్ని సామాజిక వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వివరించారు. రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. బంటు వారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోసారం వెంకటేశం మాట్లాడుతూ మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ఆధ్వర్యంలో మన గ్రామం అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. గ్రామ ప్రజలందరూ మంత్రి సూచించిన విధంగా ఐకమత్యంతో సమన్వయంతో నడుచుకుందామని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సెక్రెటరీ చామల రఘుపతి రెడ్డి బ్లాక్ ఏ అధ్యక్షుడు అనంతరెడ్డి కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు రత్నారెడ్డి ఎంపిటిసి చౌవుట పద్మ వెంకటేశం ఎస్సీ సెల్ అధ్యక్షుడు నూర్నంపల్లి నర్సిములు బంట్వారం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు దొడ్లగడ్డ రాజు సీనియర్ నాయకులు గౌస్ సుధగల్ల శీను బిల్లిపురం శ్రీకాంత్ బీర్ల అనంతి వాజిద్ హాజి మూస గఫూర్ పాష తదితరులు పాల్గొన్నారు.