బాధిత కుటుంబానికి ఎస్ కే ఆర్ ట్రస్ట్ ఆర్ధిక సాయం

Published: Friday December 23, 2022
* ఎస్ కే ఆర్ ట్రస్ట్ చైర్మన్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కొండల్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 22 డిసెంబర్ ప్రజాపాలన : బాధిత కుటుంబానికి ఎస్ కే ఆర్ ట్రస్ట్ ద్వారా ఆర్ధిక సాయం అందజేశామని ఎస్ కెఆర్ ట్రస్ట్ చైర్మన్ జిల్లా గ్రంథాలయం సంస్థ మాజీ చైర్మన్ సనగారి కొండల్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మర్పల్లి మండల పరిధిలోని పంచలింగాల్ గ్రామంలో బషీర్ మియా భార్య కుల్సుంబీ అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం రాత్రి మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎస్ కే ఆర్ ట్రస్ట్ చైర్మన్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కొండల్ రెడ్డి కుల్సుంబీ..అంత్యక్రియలకు పంపిన నగదు 5 వేల రూపాయలు స్థానిక సర్పంచ్ సురేందర్ రెడ్డి మృతురాలి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి అందజేశారు. ఆయన వెంట ఉప సర్పంచ్ చంద్ర శేఖర్, బిఆర్ఎస్ పార్టీ గ్రామాధ్యక్షుడు సోపి, బాబు, షౌకత్ గ్రామస్తులు వున్నారు.