ఎమ్మార్ఫీ ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి

Published: Saturday June 26, 2021
మధిర, జూన్ 25, ప్రజాపాలన ప్రతినిధి : ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని జూలై 7న ప్రతి మాదిగ పల్లెల్లలో ఘనంగా నిర్వహించాలనీ ఎమ్మార్పీఎస్ జాతీయ కోర్ కమిటీ సభ్యులు ఏపూరి వెంకటేశ్వరరావు మాదిగ పిలుపునిచ్చారు ఈ రోజు మధిర అ ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో ఎమ్మార్పీఎస్ మధిర నియోజక వర్గ సమావేశానికి కనక పూడి శీను మాదిగ అధ్యక్షత వహించాగ ఏపూర్ వెంకటేశ్వరరావు మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ దండోరా ఉద్యమం పేద వర్గాల ఐక్యతకు నాది పలికి అనగారిన వర్గాల ఐక్యతకు చిహ్నంగా మారి ప్రతి పేదవానికి ఆత్మ గౌరవాన్ని నీచ్చి పోరాట స్ఫూర్తిని ఈ రగిలించదనీ ఎమ్మార్పీఎస్ లక్ష్యసాధనలో అతి మ రాజ్యాధికారాన్ని సాధించడం కొరకు నిరంతర పోరాడుతుందని దీనిలో పేదవర్గాల అందరూ మహాజన సోషలిస్టు పార్టీని ఆదరించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కూరపాటి ప్రభాకర్ మాదిగ జిల్లా నాయకులు రాయవరపు దేవదాస్ మాదిగ చాట్ల రమేష్ మండల అధ్యక్షులు కోట హనుమంతరావు బోనకల్ మండలం అధ్యక్షులు మధిర మండలం అధ్యక్షులు సిద్ది పోగు ప్రసాద్ ఎర్రుపాలెం మండలం అధ్యక్షులు మేకల రమేష్ చింతకాని మండల అధ్యక్షులు రవీందర్ ముదిగొండ మండల అధ్యక్షుడు జొన్నలగడ్ మునేష్ మధిర ఎమ్మెస్ మండల అధ్యక్షుడు వేల్పుల పవన్ కళ్యాణ్ VHPS నాయకులు నాగరాజ్ గోవింద్ ఏ నూక మాదిగ తదితరులు పాల్గొన్నారు