ఘనంగా అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలు ** ఎంపీపీ అరిగేల మల్లికార్జున్ **

Published: Thursday July 28, 2022

ఆసిఫాబాద్ జిల్లా జూలై27(ప్రజాపాలన, ప్రతినిధి) : నేటి యువతకు ఏపీజే అబ్దుల్ కలాం ఆదర్శప్రాయుడని ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ అన్నారు. బుధవారం భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి వేడుకలను స్థానిక మండల కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూల మాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ భారతదేశానికి సాంకేతికంగా రాజకీయంగా ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భారతరత్న అవార్డు తో ఆయనను సత్కరించిందని గుర్తు చేశారు. అటువంటి గొప్ప నేత నేడు మనమధ్య లేకపోవడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శశికళ, ఎంపీడీవో ప్రసాద్, కో ఆప్షన్ సభ్యుడు అలీ బిన్ అమ్మద్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంధం శ్రీనివాస్, పెంటయ్య, తదితరులు పాల్గొన్నారు.