దేవి శరన్నవరాత్రుల ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న కార్పొరేటర్ అమర్ సింగ్
Published: Friday September 30, 2022
మేడిపల్లి, సెప్టెంబర్ 29 (ప్రజాపాలన ప్రతినిధి)
దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 12వ డివిజన్ బుద్ధ నగర్ సాయిబాబా ఆలయం వద్ద ఏర్పాటుచేసిన దుర్గామాత మండపం వద్ద నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్థానిక కార్పొరేటర్ అమర్ సింగ్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్పొరేటర్ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ భీమ్ రెడ్డి నవీన్ రెడ్డి, సాయిబాబా ఆలయ చైర్మన్ అనిల్ సింగ్, నలిన్ సాగర్, నర్సిరెడ్డి , బాల్ రెడ్డి, కపిల్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: