బీజేపీలో చేరిన తెలంగాణ సంపత్

Published: Tuesday June 15, 2021
మేడిపల్లి, జూన్ 14, (ప్రజాపాలన ప్రతినిధి) : మాజీ మంత్రి తెలంగాణ ప్రజా నాయకుడు ఈటెల రాజేందర్ ఆధ్వర్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షులు జె పి నడ్డా కండువా కప్పి బీజేపీ పార్టీలోకి తెలంగాణ సంపత్ ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, వివేక్ వెంకటస్వామి, ధర్మపురి అరవింద్, డీకే అరుణ, రమేష్ రాథోడ్ తదితరులు ఉన్నారు.