డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి

Published: Tuesday December 07, 2021
ఇబ్రహీంపట్నం డిసెంబర్ 6 ప్రజాపాలన ప్రతినిధి : భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో యాచారం మండల కేంద్రంలో బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సోమవారం రోజు  ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ఆల్లంపల్లి జంగయ్య మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 65 వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ రాజ్యాంగం అందించిన మహానేత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దేశ చరిత్రలోనే నిలిచిన మహానుభావుడు డాక్టర్ బి.ఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు నానక్ నగర్ సర్పంచ్ దంతుక పెద్దయ్య, ఎస్ఎఫ్ఐ యాచారం మండల అధ్యక్షులు విప్లవ్ కుమార్, DYFI నాయకులు ప్రభు, శివ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు