రోజుకు సుమారు 500మందికి టెస్టులు,వ్యాక్సిన్ చెయ్యాలి: బీజేపీ నాయకుడు ఆనంద్ కృష్ణా రెడ్డి

Published: Friday April 30, 2021

బొల్లారం, ఏప్రిల్ 29, ప్రజాపాలన ప్రతినిధి : సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ పరిధిలో సుమారు లక్షపైన జనాభా అంచనా అయితే ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర కేవలం సుమారు 150 మందికి వ్యాక్సిన్ ఇస్తున్నారని, అలాగే కోవిడ్ టెస్టులు సుమారు 150 మందికి చేస్తున్నారని తెలిసి బీజేపీ నాయకుడు కేజేఅర్ ఆనంద్ కృష్ణారెడ్డి ఇట్టి విషయాన్ని అధికారులతో చర్చించి, రోజు కనీసం 500 టెస్టులు 500 వ్యాక్సిన్ ఇవ్వాలని కచ్చితంగా డిమాండ్ చేశారు, ఈ విషయంపై డాక్టర్లు మాట్లాడుతూ సుమారు రెండు వందల మందికి మాత్రమే టెస్టులు చేయగాలమని తెలిపారు, బీజేపీ నాయకుడు ఆనంద్ కృష్ణారెడ్డి ఈ విషయంపై జిల్లా అధికారులు స్పందించి సుమారు 500మందికి కోవిడ్ టెస్టులు, వ్యాక్సిన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.