వార్డు కౌన్సిలర్ రజిని ఆధ్వర్యంలో బోరు మరమ్మతులు
Published: Monday November 07, 2022
మధిర నవంబర్ 6 (ప్రజా పాలన ప్రతినిధి) పట్టణంలోని అనేక సంవత్సరాలుగా మరమ్మతులకు నోసుకొని బోరుకి ఆదివారం కౌన్సిలర్ అరిగే రజిని ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది మరమ్మతులు చేపట్టారు. అనేక సంవత్సరాల నుండి మరమ్మత్తులకు నోసుకొని బోరు. ఒకవైపు మిషన్ భగీరథ పథకం కోసం పైప్ లైన్ తవ్వటంతో స్థానికంగా తాగునీరు అందించే పైపులు ధ్వంసం అయింది. ఒకవైపు స్థానిక పైపులైన ధ్వంసం కావటం, మరోవైపు ఆ ప్రాంతంలో ఉన్న బోరు పాడు కావడంతో ఆ ప్రాంత ప్రజలకు త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి స్పందించిన మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు ఎట్టకేలకు బోరుకి మరమ్మతులు చేపట్టారు.
Share this on your social network: