ఘనంగా బక్రీద్ పండుగ వేడుకలు బక్రీద్ పర్వదినానికి ముఖ్యఅతిథిగా బీపీ నాయక్ పాల్గొన్నారు

Published: Monday July 11, 2022

బోనకల్, జులై 11 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని గోవిందాపురం (ఎల్) గ్రామ మసీదులో బక్రీద్ పండుగను ఘనంగా జరిపారు. స్థానిక ముస్లిం మత పెద్దలు ఏర్పాట్లు చేసిన బక్రీద్ పర్వదిన సమావేశంలో ప్రత్యేక ఆకర్షణగా బిజెపి యువనేత బీపీ నాయక్ పాల్గొన్నారు, బీపీ నాయక్ మాట్లాడుతూ బక్రీద్ పండుగ త్యాగాలకు ప్రతీక అని, ముస్లిం సోదరులతో తనకున్న అనుబంధాన్ని, భారతీయ జనతా పార్టీ ముస్లింల పట్ల ఉన్న నిబద్ధతను, సమాజాన్ని ప్రేరేపించే ముఖ్యంశాలను, సత్ప్రవర్తన, సమాజహితానికి ఉపయోగపడే విషయాలను భావిభారత పౌరులకు అందించాలని, ముస్లిం చిన్నారులకు ఈ దేశం పట్ల బాధ్యతను, ఈ దేశం యొక్క మట్టి విలువను, భారతదేశం యొక్క సమగ్రత బలాన్ని నేర్పించాలని కోరారు. అనంతరం ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి జంపాల రవి మాట్లాడుతూ అందరికీ దేవుడు ఒక్కడే అని, భగవద్గీత, బైబిల్ ఖురాన్ అంతా సమాజ శ్రేయస్సుకేనని, ప్రజలందరూ ధర్మానికి కట్టుబడి కలిసిమెలిసిగా ఉంటూ దేశ ఐక్యతను చాటాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో బిజెపి యువమోర్చా మండల అధ్యక్షుడు కాలసాని పరశురాం, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షుడు మరీదు పరశురాముడు, సేవాలాల్ సేవా సమితి ఉపాధ్యక్షుడు భూక్యా రమేష్ నాయక్, గౌతమ్, పెంటు సాహెబ్, మదార్, రమదాన్ సాహెబ్, మూల్ సాహెబ్, గ్రామ పెద్దలు, ముస్లిం సహోదరులు తదితరులు పాల్గొన్నారు