అంతర్జాతీయ క్రీడాకారుడు మహేందర్ రెడ్డిని సన్మానించిన డాక్టర్ సంతోష్ సింగ్.

Published: Thursday December 01, 2022
బెల్లంపల్లి నవంబర్ 30 ప్రజా పాలన ప్రతినిధి: సీనియర్ వెటరన్ అథ్లెటిక్ క్రీడాకారుడు మహేందర్ రెడ్డి (63) అంతర్జాతీయ క్రీడలకు ఎంపికైన సందర్భంగా స్థానిక డాక్టర్ సంతోష్ సింగ్ ఆయన్ను మంగళవారం  శాలువాతో ఘనంగా సన్మానించారు.  
ఈ సందర్భంగా సంతోష్ సింగ్ మాట్లాడుతూ
మంచిర్యాల జిల్లా భీమిని మండలానికి  చెందిన మహేందర్ రెడ్డి డిసెంబర్ 3 న  మలేషియాలో జరగబోయే అథ్లెటిక్ క్రీడల్లో  పాల్గొనబోతున్నాడని,అంతర్జాతీయ క్రీడల్లో విజయకేతనం ఎగురవేయాలని, మంచిర్యాల జిల్లాకు, బెల్లంపల్లికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ్ సేన ,ఉష శ్రీ హాస్పిటల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.