ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలి

Published: Friday September 17, 2021
మేయర్ సామల బుచ్చిరెడ్డి
మేడిపల్లి, సెప్టెంబర్16 (ప్రజాపాలన ప్రతినిధి) : మహమ్మారి కరోనా వైరస్ను అరికట్టాలంటే ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి సూచించారు. కార్పొరేషన్ పరిధిలోని హేమనగర్ మరియు ఇందిరానగర్ లలో కొత్తగా ఏర్పాటు చేసిన కరోనా వ్యాక్సిన్ సెంటర్ లను కార్పొరేటర్లు బొమ్మక్ సుగుణ బాలయ్య, దొంతరబోయిన మహేశ్వరి కృపసాగర్ ముదిరాజ్ లతో కలిసి మేయర్ సామల బుచ్చిరెడ్డి సందర్శించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాస, జక్కల రాములు తదితరులు పాల్గొన్నారు.