ఉప్పల్లో ఘనంగా మహంకాళి బోనాల పండుగ ఉత్సవాలు మేడిపల్లి, ఆగస్టు5 (ప్రజాపాలన ప్రతినిధి)

Published: Saturday August 06, 2022
ఉప్పల్లో మహంకాళి బోనాల పండుగ ఉత్సవాలను ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహంకాళి బోనాలను పురస్కరించుకుని మేడ్చల్ జిల్లా ఓబీసీ మోర్చా అధికార ప్రతినిధి    కొల్లు బాల్ రాజు ఆధ్వర్యంలో  బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్, దుబ్బాక ఎమ్మెల్యే మాదవనేని రఘునందన్ రావు ఉప్పల్లో మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారి ఆశీర్వాదాాలు తీసుకున్నారు. అనంతరం బోరంపేట మురళీ, గుమిడేల్లి క్రాంతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఫలహారం బండ్లను సందర్శించారు. ఈ కార్యక్రమంలో  బీజేపీ సీనియర్ నాయకులు గోరిగే కృష్ణ, మహంకాళి లక్ష్మణ్ ముదిరాజ్, గొంగులూరి శ్రీనివాస శర్మ , రావుల బాలకృష్ణ గౌడ్, యూ బి చారి, డా శిల్పా రెడ్డి, రెడ్డిగారి దేవేందర్ రెడ్డి, మర్నేని ఫణీంద్ర,గోనె శ్రీకాంత్,సింగారం కార్తీక్, వర్కల రాజేందర్ గౌడ్, ఉప్పు శంకర్ గుప్తా,పుంజల రాకేష్ గౌడ్, బూత్కురి రాజేష్ గౌడ్,నాని నాగరాజు, నామ శ్రావణ్, ఆకుల ఋషికేశ్, దయ్యాల అమరెందర్ కురుమ, ఈదులకంటి నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area