అన్నారుగూడెంకు బస్ సౌకర్యం కల్పించాలి..

Published: Tuesday April 05, 2022
గ్రీవెన్స్ లో కలెక్టర్ కు రామారావు వినతి..
తల్లాడ, ఏప్రిల్ 4 (ప్రజాపాలన న్యూస్): తల్లాడ మండలంలోని అన్నారు గూడెంకు బస్సు సౌకర్యం కల్పించాలని బీజేపీ తల్లాడ మండల అధ్యక్షులు ఆపతి వెంకటరామారావు కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. సోమవారం కల్లూరులో గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో కరోనాకు ముందు బస్ సౌకర్యం ఉండేదని, ప్రస్తుతం ఆ బస్సులు నడవకపోవడం వల్ల విద్యార్థులు అనేక అవస్థలు పడుతున్నారని వినతిలో పేర్కొన్నారు. అదేవిధంగా ఎన్నో ఏళ్ళ క్రితం గ్రామంలో వేసిన విద్యుత్ స్తంభాలకు వైర్లు కిందకు వేలాడుతున్నాయని పేర్కొన్నారు. వీటివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే బస్సు సౌకర్యం, నూతన విద్యుత్ స్తంభాలు వేయించాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ ను కలిసిన వారిలో నాగేశ్వరరావు, ఉన్నారు.