ప్రజలందరూ శాంతి సమాధానంతో జీవించాలిభక్తిశ్రద్ధలతో సమాధులు పండగ

Published: Thursday November 03, 2022

మధిర  నవంబర్ 2 (ప్రజాపాలన ప్రతినిధి) ప్రజలందరూ శాంతి సమాధానం తో జీవించాలని వైయస్సార్ తెలంగాణ దళిత విభాగం జిల్లా అధ్యక్షులు పార్టీ మధిర నియోజకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ మద్దెల ప్రసాదరావు కోరారు. క్రైస్తవ సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో మంగళవారం సమాధులు పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ ప్రజలందరూ స్వార్ధాన్ని వీడి సత్ప్రవర్తనతో జీవించి మారుమనస్సు పొందాలన్నారు. భారంచే అలసి సొలసిన సమస్త జనులారా నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతి కల్పించెదను అని ఏసుక్రీస్తు చెప్పిన వాక్యాలను ఆయన గుర్తు చేశారు. మృతి చెందిన తమ బంధువులు పూర్వికులు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ క్రైస్తవులు ప్రతి సంవత్సరం నవంబర్ 2వ తేదీన సమాధుల పండుగ నిర్వహిస్తారని ఆయన తెలిపారు. దీనిలో భాగంగా క్రైస్తవ సోదరులు మధిర మండలంలో పలు గ్రామాల్లో క్రైస్తవ స్మశాన వాటికలోకి వెళ్లి మృతి చెందిన తమ తమ పూర్వీకుల సమాధులను పూలతో అలంకరించి కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వైయస్సార్ తెలంగాణ పార్టీ దళిత విభాగం జిల్లా అధ్యక్షులు మధిర నియోజకవర్గం కోఆర్డినేటర్ మద్దెల ప్రసాదరావు సమాధుల పండగ సందర్భంగా జరిగిన పలు పూజల్లో పాల్గొన్నారు. దీనిలో భాగంగా మద్దెల ప్రసాదరావు తల్లిదండ్రులైన మద్దెల పురుషోత్తం మంగమ్మ సమాధులు వద్ద డాన్ బాస్కో తల్లాడ ఫాదర్ జాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొని మృతి చెందిన తల్లిదండ్రులను బంధుమిత్రులను స్మరించారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మద్దెల రవి, మద్దెల జయరాజు మద్దెల స్లీవరాజు, దారా సుశీల మానస తదితరులు పాల్గొన్నారు.