గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం

Published: Thursday January 12, 2023

జన్నారం, జనవరి 11, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం శ్రీ గోదాదేవి రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగిందని పూజారి హరిదాస్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధర్మారం మెయిన్ రోడ్ నుంచి దేవస్థానం వరకు ఉత్సవ విగ్రహాలను భక్తులు ఊరేగించారు. వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో కళ్యాణ మహోత్సవంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల నుంచి అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు కళ్యాణ మహోత్సవం దర్శించుకొని, భక్తులు పూజలు చేశారు. గోదాదేవి కళ్యాణ మహోత్సవానికి భక్తులు పూల మాలల దండలతో దర్శించుకొని కళ్యాణ మహోత్సవం వీక్షించారు. గోదాదేవి కళ్యాణ మహోత్సవం అనంతరం భక్తులు వేద పండితుల నుండి ప్రసాదాలు తీసుకున్నారు. వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు జాతర సాగిందన్నారు. అనంతరం వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు విశాలమైన ప్రాంగణంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు, వేద పండితులు, గ్రామస్తులు, భక్తులు. తదితరులు పాల్గొన్నారు.