మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని రాస్తారోకో

Published: Tuesday June 22, 2021

బెల్లంపల్లి, జూన్ 21, ప్రజాపాలన ప్రతినిధి : మంచిర్యాల జిల్లా కు మంజూరు చేసిన మెడికల్ కళాశాలను బెల్లంపల్లి ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రికి వివిధ మంత్రులకు జిల్లా కలెక్టర్లకు ఎన్ని విజ్ఞప్తులు చేసినా స్పందన లేకపోవడంతో కళాశాల  ఏర్పాటు కోసం ఏర్పడిన మెడికల్ కళాశాల సాధన సమితి ఆధ్వర్యంలో సోమవారం రాస్తారోకో చేశారు. బెల్లంపల్లి పట్టణంలోని  రైల్వే స్టేషన్ వద్ద జాతీయ రహదారిపై సోమవారం నాడు కళాశాల సాధన సమితి ఆధ్వర్యంలో అన్ని పార్టీలకు చెందిన దాదాపు 150 మంది నాయకులు రాస్తారోకో నిర్వహించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు, ఈ సందర్భంగా రహదారిపై అరగంట సేపు వాహనాలు రెండు కిలోమీటర్ల వరకు నిలిచిపోయి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు వెంటనే స్పందించిన స్థానిక పోలీసులు సమితి సభ్యులను ప్రక్కకు జరిపి వాహనాల రాకపోకలను యధావిధిగా కొన సాగించారు