ఢిల్లీ టీఆర్ఎస్ మహాధర్నాలో పాల్గొన్న పీర్జాదిగూడ మేయర్లు కార్పొరేటర్లు నాయకులు

Published: Tuesday April 12, 2022
మేడిపల్లి, ఏప్రిల్ 11 (ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ వరి ధాన్యం మొత్తం కేంద్ర ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేస్తూ, ఢిల్లీలోని తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో మహాధర్నా నిర్వహించారు. ఈ నిరసన దీక్షలో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తో పాటు పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, కార్పొరేటర్లు సుభాష్ నాయక్, మద్ది యుగంధర్ రెడ్డి,కౌడే పోచయ్య, అనంత రెడ్డి, హరీ శంకర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, బచ్చే రాజు, కో ఆప్షన్ సభ్యులు జగదీశ్వర్ రెడ్డి, కార్పొరేషన్ టీఆర్ఎస్ అధ్యక్షులు దర్గా దయాకర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు లేతాకుల రఘుపతి రెడ్డి, పప్పుల అంజిరెడ్డి, బండారి రవీందర్, బొడిగె కృష్ణ, అల్వాల్ దేవేందర్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.