ఘనంగా పోల్కంపల్లి లో రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు
Published: Friday September 17, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 16, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మండల్ పోల్కంపల్లి పరిధిలో నైజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను పోల్కంపల్లి గ్రామంలో బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించటం జరుగుతుంది. గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించి, సిపిఎం కార్యాలయం వద్ద అమరవీరుల స్థూపాలకు నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ కన్వీనర్ చెరుకూరి నరసింహ్మ, శాఖ కార్యదర్శులు అశోక్, ఏ.నరసింహ, పి.వెంకటేష్, ఏం.యాదగిరి, సభ్యులు కె.వెంకటేష్, పి.స్వామి, ఏ.పాండు, జి.నరసింహ్మ, పి.జగన్ కరుణాకర్ రెడ్డి, ఎండి ఉస్మాన్, పి. కిషన్, పి.బలరాం, జి కిషన్ పి.నవీన్, జంగయ్య, ఎల్లయ్య, కె.దనంజి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: