జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మడుపల్లీలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు

Published: Wednesday April 06, 2022

మధిర ఏప్రిల్ 5 ప్రజాపాలం ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడుస్థానిక జడ్ పి ఎస్ ఎస్ మడిపల్లిలో హెచ్ఎం కే.పద్మావతి అద్యక్షతన పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అధితిగా మధిర మున్సిపల్ ఛైర్పర్సన్ మొండితోక లత, విశిష్ట అతిథిగా ప్రభాకర్  పాల్గొన్నారు. ఏం యు ఓ మాట్లాడుతూ విద్య వల్లే సమాజంలోని చీకటి తెరలు తొలగుతాయని, ముఖ్యంగా బాలికల విద్య ద్వారా సమసమాజాన్ని నిర్మించడం సాధ్యమౌతుంది అని అందరికీ విద్య యొక్క ఆవశ్యకతను తెలియచేశారు. ఛైర్పర్సన్ లతగారు మాట్లాడుతూ స్త్రీలు కూడా పురుషులతో సమానంగా అన్ని రంగాలలో విజయం సాధించడం విద్య ద్వారానే సాధ్యం అని తెలియచేశారు. మే నెలలో జరగబోయే SSC పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పాఠశాల లో నిర్వహించిన క్రీడల్లో గెలుపొందిన విద్యార్ధిని విద్యార్థులకు చలువాది ఆదెయ్య ట్రస్ట్ వారి సహకారంతో బుజ్జి గారు సహాయంతో బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అతిథులను అలరించాయి. ఈ కార్యక్రమంలో బుజ్జన్న, ఓంకార్, కిరణ్, కౌన్సిలర్లు వరలక్ష్మి, కళ్యాణి, పాఠశాల బోధన బోధనేతర సిబ్బంది, విద్యార్థులు వారి తల్లదండ్రులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.