ఐ ఎన్ టి యు సి కవ్వాల్ గ్రామ కమిటీ ఎన్నిక

Published: Thursday February 16, 2023

జన్నారం, ఫిబ్రవరి 15, ప్రజాపాలన : కాంగ్రెస్ పార్టీ వినోద్ నాయక్ ఆధ్వర్యంలో జన్నారం మండల అధ్యక్షులు ప్రభుదాస్ ఆదేశాల మేరకు మండలంలోని ఐ ఎన్ టి యు సి కవ్వాల్ గ్రామ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం ఐ ఎన్ టి యు సి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు శ్రీను గౌడ్ కవ్వాల్ ఆటో యూనియన్ కమిటీ ని ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐ ఎన్ టి యు సి కవ్వాల్ గ్రామ అధ్యక్షులుగా పంబాల నరసయ్య, ఉపాధ్యక్షులుగా కామెర దుర్గయ్య,ప్రధాన కార్యదర్శిగా అలీ ఖాన్, ప్రచార కార్యదర్శిగా ములుకల్లా రమేష్, కార్యదర్శులుగా పోడేటి రవి గౌడ్, సలహాదారులుగా భూమరాజు బోర్లకుంట, మునిగేల శ్రీనివాస్, మూగల అర్జున్, జాడీ రాజేందర్,కోశాధికారిగా జాడిబానేష్ లను ఎన్నుకున్నారు...ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ మోడీ మరియు కేసీఆర్ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి కార్మికుల పాలిట వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్మిక విభాగం లో చేరడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం లో మండల కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు