ప్రత్యేక పూజలు నిర్వహించిన జడ్పీ చైర్ పర్సన్

Published: Thursday November 03, 2022

జగిత్యాల, నవంబర్ 02 (ప్రజాపాలన ప్రతినిధి): కథలాపూర్ మండలం అంబర్ పెట్ గ్రామంలో కార్తీకమాసం సందర్భంగా శివాలయంలో  జిల్లా జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ , మార్క్ ఫేడ్ మాజీ చైర్మన్ లోక బాపు రెడ్డి  ప్రత్యేక పూజలు నిర్వహించినారు. వారి వెంట  జెడ్పీటీసీ నాగం భూమయ్య, ఎంపీపీ రేవతి గణేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేశ్వర్ రావు, పాక్స్ చైర్మన్ దేవరజం, పార్టీ అధ్యక్షుడు గంగ ప్రసాద్, జిల్లా రైతు బంధు సమితి సభ్యులు చిటి విద్య సాగర్ రావు, సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ గంగారజం, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.