అంత్యక్రియలకు ఆర్థిక చేయూత

Published: Thursday March 31, 2022
సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్
వికారాబాద్ బ్యూరో 30 మార్చి ప్రజాపాలన : అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబ సభ్యుల పరామర్శించి అంత్యక్రియల నిమిత్తం ఆర్థిక సహకారం చేశామని పట్లూరు గ్రామ సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్ అన్నారు. బుధవారం మర్పల్లి మండల పరిధిలోని పట్లూరు గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ బషీర్ అమ్మ, తాటిపల్లి నాగయ్యలు అనారోగ్యంతో మరణించారు. విషయం తెలిసి మర్పల్లి జడ్పీటీసీ పబ్బే మధుకర్ పట్లూరు గ్రామానికి వచ్చి వరికుటుంబ సభ్యులను ఓదార్చి పరామర్శించారు. తాటిపల్లి నాగయ్య నిరు పేద తెలిసి అంత్యక్రియల ఖర్చులకు రూ. 5000 లు నగదు ఇవ్వడం జరిగింది. జడ్పీటీసీ వెంట పార్టీ అధ్యక్షులు జి. అశోక్, సొసైటీ డైరక్టర్ తుమ్మల సంగన్న, ఉప సర్పంచ్ మోహిజ్, వార్డ్ మెంబర్స్ అంజాత్, డీలర్ మోహన్, మైనారిటీ సెల్ మండల అధ్యక్షులు షఫీ పరామర్శించిన వారిలో వున్నారు.