*మార్మోగిన అయ్యప్ప స్వామి మహా పడిపూజ* చేవెళ్ల నియోజకవర్గం:(ప్రజాపాలన)

Published: Wednesday December 07, 2022
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలో మంగళవారం అయ్యప్ప సన్నిధానంలో శ్రీ గురుబ్రహ్మ సతీష్ నాయర్ గురుస్వామి కరములచే అయ్యప్ప మహా పడిపూజ ఘనంగా జరిగింది. ఒకరోజు ముందుగానే ప్రధాన రహదారుల వెంబడి అయ్యప్ప స్వాములకు చెందిన ఫ్లెక్సీలు కటౌట్లు భారీగా నెలకొల్పారు. ఈ పడిపూజకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి తీర్థ ప్రసాదాలను అందుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చేవెళ్లలో ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య హాజరై తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వాములను పలకరించారు. పడిని వెలిగించేందుకు వేలంపాటలో రెండు లక్షల 55 వేల 555 రూపాయలకు మద్దెల చింటూ స్వామి దక్కించుకొని పడిని కాల్చారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల అయ్యప్ప స్వాములు. చేవెళ్ల టిఆర్ఎస్ పార్టీ నాయకులు. గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.