కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు సమస్యలపై ధర్నా

Published: Wednesday November 23, 2022
మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ బ్యూరో 22 నవంబర్ ప్రజా పాలన : కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు సమస్యలపై ధర్నా నిర్వహించనున్నామని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
టీపీసీసీ అధ్యక్షులు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి ఆదేశాలమేరకు ఈ నెల 24వ (గురువారం ) తేదీన వికారాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లోని ఎంఆర్ఓ ఆఫీస్ ల ముందుకు మండల కాంగ్రెస్ కమిటీల ఆధ్వర్యంలో  పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని స్పష్టం చేశారు.