దళిత్ శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు

Published: Wednesday February 09, 2022
మంచిర్యాల టౌన్, ఫిబ్రవరి 08, ప్రజాపాలన : భారత రాజ్యాంగాన్ని మార్చాలని వ్యాఖ్యలు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు  బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ దళిత్ శక్తి ప్రోగ్రాం- మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యం లో రిలే నిరాహారదీక్షలు మంగళవారం రోజున మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఐబీ చౌరస్తా,అంబేద్కర్ విగ్రహం మంచి మంచిర్యాల ఐకాన్ పక్కన దీక్ష కోసం కేటాయించిన స్థలంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి వంశీ మహారాజ్ మరియు సంఘీభావంగా వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారని తెలిపారు.