శ్రీ బుగ్గ రామలింగేశ్వరాలయంలో లక్ష బిల్వార్చన

Published: Tuesday August 24, 2021
వికారాబాద్ బ్యూరో 23 ఆగస్ట్ ప్రజాపాలన : శ్రావణ మాసంలో శివారాధనతో పాటు రుద్రాభిషేకం నిర్వహించిన కుటుంబాలకు శుభాలు కలుగుతాయనే హిందువుల విశ్వాసం. శ్రావణ మాసం పురస్కరించుకుని సోమవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వరాలయంలో లక్ష బిల్వార్చన, పుష్పార్చన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. లక్ష బిల్వార్చనలో భాగంగా నమకం చమకంలోని వేద మంత్రోచ్ఛారణలతో ఆలయ ప్రాంగణం అంతా ప్రతిధ్వనించింది. ఆలయ చైర్మన్ ఆత్మలింగం, వీరేశం, రమేష్, ఆలయ అర్చకులు శ్రీకాంత్ స్వామి, కోటిలింగం, రాకేష్ స్వామి, దయానంద స్వామి తదితరులు పాల్గొన్నారు.