తన డివిజన్ ప్రజలకు నేను తోడుంటానన్న డివిజన్ కార్పొరేటర్ మురుగేష్
Published: Saturday April 01, 2023
జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఐదవ డివిజన్ అయ్యప్ప కాలనీలో పాండురంగ చారి చనిపోవడం జరిగింది. నిరుపేద కుటుంబం ఇంటి పెద్దను కోల్పోవడంతో విషయం తెలిసిన ఐదవ డివిజన్ కార్పొరేటర్ మురుగేష్ 5000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన యొక్క డివిజన్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి తోడుంటానని ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించడానికి ముందు ఉంటానని అన్నారు. అనంతరం అంత్యక్రియల కార్యక్రమాన్ని ముగించి ఎలాంటి సహాయం కావాలన్నా మొహమాటం చెందకుండా అడగమని కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చి సెలవు తీసుకున్నారు.
Share this on your social network: