ఛలో రాజ్ భవన్ ముట్టడికి జిన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల ముందస్తు అరెస్టులు

Published: Friday July 23, 2021
జిన్నారం, జులై 22, ప్రజాపాలన ప్రతినిధి : ఛలో రాజ్ భవన్ ముట్టడికి బయలుదేరిన జిన్నారం మండల కాంగ్రెస్ పార్టీ నేతలను జిన్నారం పోలిసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా దేశ ప్రజల ప్రాథమిక హక్కులను వ్యక్తిగత గోప్యతను తూట్లు పొడుస్తూ మోడీ సర్కార్ పెగాసేస్ స్పెవర్ తో నిఘా పెట్టడం దుర్మగమైన చర్య అని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు.జిన్నారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాసరి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్ కార్యక్రమాన్ని అడ్డుకోవడం హేమామైన చర్య అని ఆయన అన్నారు, రాబోయే రోజుల్లో మోడీ సర్కార్ బిజెపి ప్రభుత్వనికి ప్రజలు తగ్గిన బుధ్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గంగు రమేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వడ్డే కృష్ణ, మాజీ ఎంపిటిసి పుట్టి భాస్కర్, ఉప సర్పంచ్ జింకల రవీందర్, పల్నాటి భాస్కర్, కంది ఎల్లయ్య, యనగండ్ల నరేందర్, పట్నం శ్రీనివాస్, సత్యనారాయణ, జంగ్గిరెడ్డి, స్వామి, బాలు, వడ్ల నరేష్, సాయి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు