దెందుకూరులో ముగిసిన అంకమ్మ తల్లి జాతర వేడుకలు

Published: Monday March 06, 2023

మధిర రూరల్ మార్చి 5 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో గురువారం నాడు నుండిదెందుకూరు గ్రామ ప్రజలు భక్తులు ప్రజాప్రతినిధులు వివిధ గ్రామాల పెద్ద ఎత్తున ప్రజలకు పాల్గొని మన గ్రామ ఇలవేల్పు దేవతలైన అంకమ్మ మహాలక్ష్మమ్మ అమ్మవార్ల 8వ సంవత్సర ముగిసిన జాతర మహోత్సవ  2 తారీకు నుండి నుండి ఈరోజు వరకు ముగిసిన జాతర ఉత్సవాలు ఈ కార్యక్రమానికి దెందుకూరు గ్రామ సర్పంచ్ కోటా విజయశాంతి కృష్ణ దంపతులు అమ్మవారికి పొంగళ్ళు నైవేద్యాలు పట్టు వస్త్రాలు సమర్పించి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా ఊరు అమ్మవారి జాతర ప్రజలందరితో సహకారంతో ఈరోజు అమ్మవారు ముగింపు ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగినట్లు అదేవిధంగా మా ఊరు చల్లగా దీవెనలతో అమ్మవారా ఆశీస్సులతో ఉండాలని వారు తెలిపారు అమ్మవారు ఉత్సవాలు భాగంగా 2 తారీకు ఉదయం ఐదున్నర గంటలకు తోర్నపాకు సాయంత్రం 4గంటలకు అమ్మవార్లకు గ్రామోత్సవ కార్యక్రమం జరుగును  3 తారీకు ఉదయం 11 గంటల నుండి జల బిందెల కార్యక్రమం సాయంత్రం 7 గంటలకు పెద్దకాపు పెద్ద గొల్ల సమక్షంలో అమ్మవార్లకు బియ్యం కొల నాలుగో తారీఖు ఉదయం 10 గంటల నుండి బొడ్రాయి వరకు జల బిందెల కార్యక్రమం  ఉదయం 11 గంటలకు అమ్మవారి జాతరలో అత్యంత విశేషంగా జరుగు కార్యక్రమం లగుడు గొర్రె కార్యక్రమం తరువాత సాయంత్రం 5 గంటల నుండి అమ్మవారి ఉత్సవ వాహనమైన పూలకప్పర ఊరేగింపుగా గ్రామ పురవీధుల్లోకి వస్తుంది 5 తారీకు న ఆదివారం రోజు అమ్మవారి లకు భక్తులందరూ బోనాలు చెల్లించు కార్యక్రమం తదనంతరం సాయంత్రం 5 గంటల నుండి శిరిమాన్ కార్యక్రమం కలదు కార్యక్రమం ఉద్దేశం గ్రామంలోని భక్తులకు సత్సంతానం కలగాలని ఆడపడుచులకు అమ్మవారు అండదండలు ఉండాలని జరిగే కార్యక్రమం కావున ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని అంకమ్మ మహాలక్ష్మమ్మ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఈ కార్యక్రమంలో ప్రజలు ప్రజాప్రతినిధులు భక్తులు పాల్గొన్నారు.