నేలకొండపల్లి మండలంలో లో ఘనంగా రైతు బందు సంబరాలు..

Published: Friday January 07, 2022
పాలేరు జనవరి 5 ప్రజాపాలన ప్రతినిధి : నేలకొండపల్లి, జనవరి 5: రైతు బందు ప్రారంభమై నాలుగు సంవత్సరాలు గడుస్తున్న నేపధ్యంలో బుధవారం మండలంలోని చెరువుమాదారం రైతు వేదిక వద్ద రైతు బందు సంబరాలను ఘనంగా నిర్వహించారు. తొలుత రైతు వేదికను మామిడి తోరణాలతో అలంకరించారు. అనంతరం వ్యవసాయ విస్తరణ అధికారి శిరీష ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో  జిల్లా రైతు బందు సభ్యులు దీరావత్తు శాంతి, నేలకొండపల్లి రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు శాఖమూరి సతీష్, గ్రామ రైతు బందు సభ్యులు ఎనికే జానకి రామయ్య తదితరులు పాల్గొన్నారు.