ఘనంగా బంగారు లక్ష్మణ్ జయంతి వేడుకలు

Published: Thursday March 18, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల కేంద్రంలో బిజెపి మండల కమిటి ఆధ్వర్యంలో బుధవారం బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షులు, మాజీ కేంద్రమంత్రి స్వర్గీయ బంగారు లక్ష్మణ్ 82 వ జయంతి సందర్భముగా ఆయన చిత్రపటానికి పులమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాగెల్లీ సుధాకర్, దంతురి సత్తయ్య, మత్స్యగిరి, బచ్చు శ్రీనివాస్, మంద నర్సింహ, రేగురి అమరేందర్, దయ్యాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.