పలు అభివృద్ధి పనులను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య

Published: Friday June 18, 2021
పరిగి 17జూన్ ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలో గల రెండో వార్డు లో నర్సరీలను మూడవ వార్డ్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో పార్కును అడిషనల్ కలెక్టర్ చంద్రయ్యతో కలిసి పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా గత సంవత్సరం లక్ష మొక్కలు పెంచామని, ఈ సంవత్సరం గాను 50 వేల మొక్కలు పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా మున్సిపల్ పరిధిలో గల పెద్ద మోరి విషయమై వర్షాకాలం దృష్టిలో  ఉంచుకొని జెసిబి, డోజర్ సాయంతో వెంటనే చర్యలు చేపడతామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ వేముల కిరణ్, వారాల రవీంద్ర, తంగడపల్లి వెంకటేష్, బి రవి కుమార్, మీర్ తాహిర్ అలీ మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.