వి ఆర్ ఏ ల సమస్యలు పరిష్కరించాలి

Published: Saturday July 23, 2022
మంచిర్యాల టౌన్, జూలై 22, ప్రజాపాలన:  వీఆర్ఏలు జీతాలు పెంచి, పర్మినెంట్ ఉద్యోగస్తులుగా ప్రభుత్వం వెంటనే గుర్తించాలని,  గ్రామ రెవెన్యూ సహయకులు  దీక్షలు చేపట్టారు, మద్దతుగా  సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ వీఆర్ఏ లతో  ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించుకుంటుందని, వారికి జీతాలు పెంచి వెంటనే, ప్రభుత్వ ఉద్యుగులుగా గుర్తించాలి.యాభై సంవత్సరాలు దాటిన వాళ్లకు పదవి విరమణ ఇచ్చి, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలాని  చేస్తున్న దీక్షలు న్యాయమైనవే  వారికి సీఐటీయు తరుపున సంపూర్ణ మద్దతు ఉంటుందని  అన్నారు.ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ ఓంకార్, ప్రధాన కార్యదర్శి  శ్రీనివాస్, కన్వినర్ దుర్గం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.