పశువైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్ సీతారామిరెడ్డి..

Published: Thursday October 20, 2022
తల్లాడ, అక్టోబర్ 19 (ప్రజా పాలన న్యూస్):
 *తల్లాడ మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో పశువైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ ఓబుల సీతారామిరెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పశువైద్యులు పశువులకు సంబంధించిన గర్భధారణ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీచేశారు. అనంతరం సర్పంచ్ సీతారామరెడ్డి మాట్లాడుతూ ఇటువంటి వైద్య శిబిరాలను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శీలం ముత్తారెడ్డి, నాయకులు శీలం వెంకటనారాయణ రెడ్డి, బండి బాలసౌరి, శీలం అంజిరెడ్డి, గోపాల మిత్రులు, తదితరులు పాల్గొన్నారు.*