టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శిగా జనార్దన్ .
Published: Wednesday November 09, 2022
జన్నారం, నవంబర్ 08, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండల టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా మండల పొన్కల్ గ్రామానికి చెందిన తెలంగాణ సీనియర్ నాయకుడు సుల్వ జనార్దన్ ను మండల ప్రధాన కార్యదర్శిగా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖనాయక్ నియమాకపత్రం అందించి సన్మానించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన జనార్ధన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పజెప్పిన ఎమ్మెల్యే కు రుణపడి ఉంటానని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని రాష్ట్ర సాధనలో తన వంతు కృషి చేశానని, పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని అన్నారు. మండలంలోని అన్ని గ్రామాలలో టిఆర్ఎస్ బలోపేతానికి కృషి చేస్తానని ఆయనకు ఎమ్మెల్యే సూచించన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శిని పలువురు టిఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, తదితరులు, అభినందించారు.
Share this on your social network: