పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఉంటుంది

Published: Tuesday August 31, 2021
బెల్లంపల్లి ఆగస్టు 30 ప్రజాపాలన ప్రతినిధి : రాష్ట్ర సాధన కోసం ఉద్యమ పార్టీగా అవతరించిన తెలంగాణ రాష్ట్ర సమితి  పార్టీలో భాగస్వామ్యం కావడం మన అందరి అదృష్టం అని, పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం లభిస్తుందని అన్నారు. సోమవారం నాడు స్థానిక క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 7 మండలాలు బెల్లంపల్లి మునిసిపల్ పరిధిలోని పార్టీ ప్రజా ప్రతినిధులు ముఖ్య నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి తెరాస పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కే సి ఆర్, తెరాస పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కే టి ఆర్ ఆదేశాల మేరకు  పార్టీ నూతన పట్టణ, వార్డ్, గ్రామ, మండల స్థాయి కమిటీల నిర్మాణం ఏర్పాటు కోసం సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందనీ అన్నారు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమపార్టీగా అవతరించి, తెలంగాణ రాష్ట్రం సాధించిన తెరాస పార్టీలో భాగ్యస్వామ్యం అవడం మనందరి అదృష్టమని, టి ఆర్ ఎస్ పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.