కుల సంఘాల భవన నిర్మాణానికి చెక్కుల పంపిణీ

Published: Thursday November 18, 2021

కోరుట్ల, నవంబర్ 17 (ప్రజాపాలన ప్రతినిధి) : కోరుట్ల మండలంలోని జొగన్ పల్లి గ్రామాల్లో డీఏంఎఫ్టీ నిధుల నుండి కోరుట్ల నియోజక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యా సాగర్ రావు రెడ్డీస్ సంఘానికి 3,10,000/-, గంగపుత్ర సంఘానికి 3,15,000/- లు మంజూరు చేయించారు. బుధవారం రోజున సర్పంచ్ దుంపల నర్సు రాజ నర్సయ్య కుల సంఘాలకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దుంపల నర్సు రాజ నర్సయ్య మాట్లాడుతూ కుల సంఘాల బలోపేతానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యా సాగర్ రావు కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కుల సంఘాల నిధులు మంజూరు పట్ల రెడ్డీస్, గంగాపుత్ర సంఘ సభ్యులు హర్షం వ్యక్తo చేస్తూ, ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుకి, గ్రామ సర్పంచ్ దుంపల నర్సు రాజ నర్సయ్యకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో ఉప సర్పంచ్ బద్ధం తిరుపతి రెడ్డి, వార్డ్ సభ్యులు బద్ధం రాజేశం, పల్లికొండ రమేష్, పల్లికోండ నర్సయ్య, సంఘ సభ్యులు బుచ్చిరెడ్డి, నాగేశ్వర్ రెడ్డి, భూమా రెడ్డి, తోకల నర్సయ్య, స్వామి, శేఖర్, సంఘ సభ్యులు, తదిధరులు పాల్గొన్నారు.