ప్రజ గోస బిజెపి భరోసా, కార్నర్ మీటింగ్

Published: Monday February 27, 2023

జన్నారం, ఫిబ్రవరి 26, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా  జన్నారం మండలం రేండ్లగూడ గ్రామంలో మండల అధ్యక్షులు గోలిచంద్ అధ్యక్షతన ఖానాపూర్ నియోజకవర్గ మండల ప్రజా కోస బిజెపి భరోసా కార్నర్ మీటింగ్ జరిగిందన్నారు. ఆదివారం శక్తి కేంద్ర ఇంచార్జ్ బెడద గోపాల్ గారి అధ్యర్యంలో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ ఈ సందర్భంగా ఖానాపూర్ అసెంబ్లీ నాయకులు అజ్మీరా హరినాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో కెసిఆర్ పాలనను, స్థానిక ఎమ్మెల్యే అజ్మీర రేఖా నాయక్ వైఫల్యాలను ప్రజలకు తెలియపరుస్తామన్నారు. కేంద్రంలోని బీజేపీ పాలనలో ప్రజలకు ఎలాంటి భరోసా ఇస్తుందో తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ రాథోడ్ రమేష్, బూత్ అధ్యక్షులు వేయికళ్ల రవి, అల్లం నాగరాజు, రాజశేఖర్, ఎంపిటిసి మధుసూదన్ రావు, కొంతం శంకరయ్య, జనరల్ సెక్రెటరీ వంగపల్లి సురేష్, మండల ఉపాధ్యక్షులు ప్రేమ్ సాగర్, మండల కార్యదర్శి కస్తూలపురి నగేష్, ఏబీవీపీ జిల్లా కార్యవర్గ సభ్యులు సంధ్యవేణి పవన్ కుమార్ యాదవ్, కిషన్ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి అల్లం సురేష్, బీజేవైఎం జిల్లా నాయకులు కొండపల్లి మహేష్, బిసి మండల మోర్చా అధ్యక్షులు కడ అనిల్, బీసీ మోర్చా జనరల్ సెక్రెటరీ నల్లపు కృష్ణ, సోషల్ మీడియా కన్వీనర్ బుర్ర గడ్డ జగన్, ముదేళ్ల శంకర్, మండల బిజెపి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.