మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతి సందర్భంగా ఆహార ఫ్యాకెట్ల మాస్కులు గ్లౌజులు పంపిణీ

Published: Saturday May 22, 2021
మేడిపల్లి, మే 21 (ప్రజాపాలన ప్రతినిధి) : స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని ఉప్పల్లో కాంగ్రెస్ నాయకులు రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు తవిడబోయిన గిరిబాబు ఆధ్వర్యంలో పేదలకు ఆహార ప్యాకెట్లను మాజీ కార్పొరేటర్, సీనియర్ కాంగ్రెస్ నేత మందుముళ్ళ పరమేశ్వర్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి, ఉప్పల్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అరుణ్, జిల్లా అధ్యక్షులు శ్రవణ్ రెడ్డి, జలీల్ పాశ, గంగాధర్, సుధాకర్, సందీప్, కోటేష్, భాస్కర్ పంపిణీచేశారు. కార్పొరేటర్ మందుముళ్ళ రజితపరమేశ్వర్ రెడ్డి పారిశుద్ధ్య కార్మికులకు గ్లౌజులు, మాస్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సల్ల ప్రభాకర్ రెడ్డి, కోమటిరెడ్డి కృష్ణ రెడ్డి, మంద మురళీ కృష్ణ రెడ్డి, అలుగుల అనిల్ కుమార్, లింగంపల్లి రామక్రిష్ణ, అల్వాల్ భాస్కర, సుంకు శేఖర్ రెడ్డి, జనగాం రామక్రిష్ణ, గోరిగే మహేష్, ప్రశాంత్ రెడ్డి, ఢిల్లీ చంద్రశేఖర్ రెడ్డి, జుత్తు రెడ్డి కన్నమైన నరేష్ తదితరులు పాల్గొన్నారు.