మునుగోడులో కాంగ్రెస్ దే విజయం జిల్లా కాంగ్రెస్ నాయకులు జవాజి ఆనందరావు

Published: Friday October 28, 2022

మధిర రూరల్ అక్టోబర్ 27 ( ప్రజాపాలన ప్రతినిధి) మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి అత్యధిక మెజార్టీతో గెలుపొందుతారని జిల్లా కాంగ్రెస్ నాయకులు జవ్వాజి ఆనందరావు పేర్కొన్నారు. గురువారం మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మర్రిగూడ మండలం భీమ్లా తండాలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతితో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జావ్వాజి ఆనందరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పాలనలోనే మునుగోడు నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందన్నారు. మర్రిగూడ మండల ఇన్చార్జి పటేల్ రమేష్ రెడ్డి ఆదేశాల మేరకు మండలంలో కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి గెలుపు కోసం ప్రతి రోజు గడపగడపకు ప్రచారం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు టిఆర్ఎస్ బిజెపి డబ్బుల రాజకీయాలను మునుగోడు ఓటర్లు తిప్పి కొడతారని ఆయన పేర్కొన్నారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలు హస్తం గుర్తుపై ఓట్లు వేసి స్రవంతిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకురాలు భవాని రెడ్డి కర్లపూడి అప్పారావు ఉపేందర్ ఆవుల గురుబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు