చెంగిచెర్ల మేకల మండిలో పశువర్ధక శాఖ డైరెక్టర్ ఆకస్మిక తనిఖీలు

Published: Monday May 10, 2021
మేడిపల్లి, మే9 (ప్రజాపాలన ప్రతినిధి) : మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాలతో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి చెంగిచెర్ల మేకల మండిని ఆదివారం నాడు రాష్ట్ర పశువర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్ ఆధ్వర్యంలో అధికారులతో కలసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా డైరెక్టర్ రాంచందర్ మాట్లాడుతూ మేకల మండిలో ఉన్న సమస్యలతో పాటు ఇక్కడ జరుగుతున్న పరిస్థితి లన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించామని తెలిపారు. కార్పొరేషన్ నుండి పొల్యూషన్ కంట్రోల్ శాఖకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ మున్సిపల్ నగరపాలక సంస్థ 1వ డివిజన్ కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్, టీఆర్ఎస్ నాయకులు కొత్త రవి గౌడ్, ఆడ్వికేట్ శేఖర్ యాదవ్, స్థానికులు పాల్గొన్నారు.