గ్రామాల్లో పర్యటించిన అధికారులు...

Published: Tuesday June 22, 2021
బీరుపూర్, జూన్ 21 (ప్రజాపాలన ప్రతినిధి) : బీరుపూర్ మండలంలోని రేకులపల్లె గ్రామంలో సోమవారం రోజున బీర్పూర్ మండల ప్రత్యేకాధికారి దివ్య భారతి ఎంపీడీవో మల్లారెడ్డి ఎంపీవో రామకృష్ణ రాజు గ్రామంలో పర్యటించారు. గ్రామంలో శానిటేషన్ వీధుల పరిశుభ్రత డ్రైనేజీ పూడిక తదితర అంశాలపై చర్చించి వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎలగందుల లక్ష్మిఅశోక్ ఉప సర్పంచ్ కాసారపు రమేష్ వార్డు సభ్యులు పంచాయతీ కార్యదర్శి ఆరే రాణి కారోబర్ మ్యాడ గంగరెడ్డి గ్రామ పంచాయతీ సిబ్బంది తాటిపెల్లి గంగయ్య తదితరులు పాల్గొన్నారు.